జర్మనీలోని వర్మ్స్ నగరంలో నాటి ఐదో చార్ల్స్ చక్రవర్తి మార్టిన్ లూథర్ కి వ్యతిరేఖంగా శాసనం జారీ చేసిన రోజు. దీనినే ఈడిక్ట్ ఆఫ్ వర్మ్స్ లేక వర్మ్స్ శాసనం అంటారు. లూథర్ రచనల్ని నిషేధిస్తూ, ఆయన్ని రాజద్రోహిగా ప్రకటిస్తూ చేసిన శాసనం ఇది. లూథర్ ను నిర్బంధించి రాజు ముందు నిలబెట్టాలన్నది శాసనం. ఈ శాసనాన్ని గట్టిగా అమలు చేయలేకపోయినా ఈ శాసనం వల్ల ఆ తర్వాత లూథర్ తన కదలికల్ని నియంత్రించుకోవాల్సి వచ్చింది. కాలక్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ నాటి మతాధిపతి పోప్ కు వ్యతిరేఖంగా తిరుగుబాటు చేసి సంఘ సంస్కరణకు నాంది పలికాడన్న చరిత్ర మనకు విదితమే.