
నేటి విశ్వాస నాయకుడు
జోహాన్ లియోన్హార్డ్ డోబర్
పరలోక పిలుపు : 1 ఏప్రిల్ 1766
మిషనరీ, సువార్తికుడు, చర్చి నాయకుడు, బిషప్
జోహాన్ లియోన్హార్డ్ డోబర్ (1706–1766) జర్మన్ మిషనరీగా కరీబియన్లో బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల మధ్య తన మిషన్ సేవకు బాగా ప్రసిద్ది చెందాడు. ఈయన మొరవియన్ చర్చి మిషన్ ఉద్యమ మార్గదర్శక సభ్యులలో ఒకరు. ఈయన సువార్త ప్రకటించడానికి అవసరమైతే తమను తాము బానిసలుగా అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ తెల్ల బానిసత్వం నిషేధించబడింది. ఈయన మొరావియన్ చర్చిలో నాయకుడై బిషప్గా సేవ చేశాడు. 1745 నుండి లివోనియాలో పనిచేస్తూ, తరచుగా ఇంగ్లండ్, హాలండ్, సిలేసియాకు వెళ్లాడు. ఈయన గ్లోబల్ మిషనరీ ప్రయత్నాలకు, మొరావియన్ చర్చి ఖ్యాతిని స్థాపించడంలో సహాయపడింది, అనేక ఇతర మిషనరీలను ప్రేరేపించింది.
డోబర్ 1706 మార్చి 7న జర్మనీ, స్వాబియాలో మోంచ్ స్రోత్ లో జన్మించాడు. తన తండ్రి నుండి కుండల వ్యాపారాన్ని నేర్చుకున్నాడు. ఈయన 17 సంవత్సరాల వయస్సులో హెర్న్ హట్ లోని మొరావియన్ చర్చిని సందర్శించినప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించాడు. జూలై 24, 1731న, ఈయన కరీబియన్ బానిసలకు మిషన్ల గురించి కౌంట్ జిన్ జెన్ డార్ఫ్ చేసిన ప్రసంగం నుండి ప్రేరణ పొంది, మిషన్కు పిలిచినట్లు భావించగా, తన స్నేహితుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, వెళ్ళడానికి సిద్ధమవ్వగా. మిషన్ను స్థాపించడంలో డోబర్తో పాటు డేవిడ్ నిట్ష్మాన్ ఎంపిక చేయబడ్డాడు.
ఈయన మిషనరీ ప్రయాణానికి వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ తన స్నేహితునితో కలసి అక్టోబర్ 8, 1732న ప్రయాణించి, డిసెంబరు 13న ఆఫ్రికాకు చేరుకున్నారు. నిరాడంబరంగా జీవిస్తూ, బానిసలుగా ఉన్న ఆఫ్రికన్లకు బోధించి కొంత విజయాన్ని సాధించారు. వారు యాభై సంవత్సరాలు పనిని కొనసాగించారు, కరేబియన్ అంతటా చర్చిలను స్థాపించారు మరియు 13,000 మంది మతమార్పిడులకు బాప్టిజం ఇచ్చారు. అతను మొరావియన్ బ్రదర్న్ యొక్క చీఫ్ ఎల్డర్గా నియమించబడిన తర్వాత యూరప్కు తిరిగి వచ్చాడు. ఈయన ప్రయత్నాలు మొరావియన్ మిషనరీలకు పునాది వేసింది, చర్చి నిజమైన అధిపతి, ప్రధాని యేసుక్రీస్తు మాత్రమేనని మొరావియన్ ఐక్యత నిర్ధారించడానికి దారితీసింది.
డోబర్, హెర్న్ హట్ కు తిరిగి చేరి, చివరివరకు మిషన్ బోర్డులోనే సేవచేశాడు. 60 సంవత్సరాల వయస్సులో మరణించి, జర్మనీ, హెర్న్ హట్ లో కమ్యూనిటీ స్మశానవాటిక గాడ్స్ ఎకర్ లో అతని అంత్యక్రియలు జరిగాయి.