
నేటి విశ్వాస నాయకుడు
మైఖేల్ ఒలువాముయిదే అడెగ్బోలగన్
పరలోక పిలుపు : 01 మార్చి 1996
సువార్తికుడు, పాస్టర్, సంగీతకారుడు, చర్చి నిర్వాహకుడు.
మైఖేల్ (1918-1996) తన స్వంత దేశమైన నైజీరియాలో క్రీస్తు పరిచర్యకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న దేవుని పరిచారకుడు. ఈయన చర్చిలను పునర్నిర్మించడం, విశ్వాసులను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఒకప్పుడు ప్రముఖ విజయవంతమైన వ్యాపారవేత్త, దేవుని పిలుపుకు సమాధానం ఇవ్వడానికి, మొత్తము విడిచిపెట్టి పరిచర్యలో సమర్థవంతంగా పనిచేశాడు. ఫోలోరున్షో హుస్విన్ నాయకత్వంలో నైజీరియన్ పెంటెకోస్టల్ మిషన్, వాయిస్ ఆఫ్ రిడంప్షన్ గోస్పెల్ చర్చ్లో పరిచర్య చేసేవాడు. ఒక క్రైస్తవుడు స్వర్గానికి చేరుకోకుండా అడ్డుకునే మూడు విషయాలు ఉన్నాయని, తన ప్రసంగాలలో నొక్కి చెప్పేవాడు. అవి, మీరు ఏమి చూస్తారు, మీరు ఏమి విన్నారు, మీరు చేసే పనులకు ఇతరులు ఎలా స్పందిస్తారు. మూడు విషయాల ద్వారా పరధ్యానంలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈయన ఎల్లప్పుడూ క్రైస్తవులను హెచ్చరించాడు. ఈయన సంగీతాన్ని ఇష్టపడుచు, వాయిద్యాలను బాగా వాయించేవాడు. తన బాధ్యతలో భాగంగా, పాస్టర్లను బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి, ఎల్లప్పుడూ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ చర్చిలను దర్శించేవాడు.
మైఖేల్ మే 22, 1918న మిస్టర్ అండ్ మిసెస్ అబ్రహం ఇగ్బరో సెరికి, అడెగ్బోలాగన్ దంపతులకు జన్మించాడు. ఈయన 1942లో తన విద్యను పూర్తి చేసి, లాగోస్కు వెళ్లడానికి ముందు ఉపాధ్యాయుడిగా చేరాడు. తరువాత 1950లో వ్యాపారం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూసే వరకు అభివృద్ధి చెందింది. ఒక ప్రవక్త దేవుని పిలుపును అంగీకరించమని ఈయన్నుకోరగా, మొదట్లో ప్రతిఘటించాడు. 1949లో, ఈయన కంఫర్ట్ ఓలవోలువాడుణ్ణి అడెగ్బోలాగున్ని వివాహం చేసుకున్నాడు, వారికి ఐదుగురు పిల్లలు. 1969లో, చివరకు దేవుని పిలుపుకు లొంగి లాగోస్లోని క్రైస్ట్ అపోస్టోలిక్ చర్చిలో తన పరిచర్యను ప్రారంభించాడు.
మైఖేల్ 1972లో పరిచర్యకు నియమింపబడి, భౌతిక దాడులతో సహా వివిధ ఆధ్యాత్మిక సవాళ్లను ఎదుర్కొన్నాడు. 1985లో, ఈయన వాయిస్ ఆఫ్ రిడంప్షన్ గోస్పెల్ సెంటర్లో చేరి, చర్చి ఆడిటోరియం పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1986లో తన భార్యను కోల్పోయిన తరువాత, పూర్తిగా దేవుని పనికి అంకితమయ్యాడు. రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ పర్యటన సందర్భంగా, చర్చి భవనాన్ని పూర్తి చేసిన తర్వాతే తాను చనిపోతానని ముందే చెప్పాడు. ముందు అనారోగ్యంతో ఉన్నా కాని, పని పూర్తి చేసే వరకు ప్రభువు ఈయన్ని ఉంచాడు. ఈయన వారసత్వంలో చర్చి పెరుగుదల, పరిపాలన, క్రైస్తవ జీవితంలో పరధ్యానాన్ని నివారించడంపై ఈయన బోధనలు ఉన్నాయి. తన అంతిమ యాత్రకు ముందే, తన మరణానికి ముందస్తు సూచన ఉన్నట్లు తేలింది. రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ లోని చర్చి బ్రాంచ్ల తనిఖీ పర్యటన తర్వాత, బెనిన్కు వెళ్లే మార్గములో మరణించాడు, తన మృతదేహాన్ని లాగోస్కు తీసుకురాగా, ఈయన సందర్శన గొప్ప వీడ్కోలు అని అందరు గ్రహించారు.