దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు

పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.

ప్రభుత్వాలన్నీ దేవుడివే

ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.

భయం లేని నమ్మకం

ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!

స్వీయ చిత్రం

ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నల్లో ఒకటి”నేనెవరిని?” అన్నది. నేడు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఇంటర్వ్యూల్లో అడిగే మొదటి ప్రశ్న ఇదే. “ఓ మనిషీ, నిన్ను నీవు తెలుసుకో” అన్నారు ప్రాచీన తాత్వికులు. ఐతే మన ఆసక్తి వేరు. మనం మనల్ని తెలుసుకోవడం వదిలేసి పక్కింటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడటం చాలా మందికి సరదా. ఇపుడు సోషల్ మీడియా నిండా ఇదే కంటెంట్! వాళ్లేమిటి? వీళ్లేమిటి? వాళ్ళ బతుకులేంటి? వీళ్ళ బతుకులేంటి? ఇదే ధ్యాస!