1883 నవంబర్ 9

ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).

అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.