1670 నవంబర్ 15

ఈరోజు ప్రముఖ విద్యా సంస్కరణ కర్త, ఆధునిక విద్యకు ఆద్యుడైన విద్యావేత్త, ఆధ్యాత్మిక వేత్త జాన్ ఆమోస్ కొర్మేనియస్ గారు పరమపదించిన రోజు (15.11.2024).

గురువు పాదాల చెంత…

మన దేశంలో గురు సంప్రదాయం కొత్తేమీ కాదు. అనాది కాలంగా వస్తున్నదే! దైవాన్ని పరిచయం చేసుకోవడానికి, దైవ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురువు తప్పనిసరి అన్నది మన వాళ్ళ నమ్మకం. అంచేత గురువు గారిని దేవుడి స్థానానికి ఎత్తేసి “గురు దేవోభవ” అని మొక్కేసే పరిస్థితీ మన సంస్కృతిలో ఉండనే ఉంది. ఇందుకు భిన్నమైన ప్రబోధం చేస్తున్నారు మన ప్రభువు.

భయం లేని నమ్మకం

ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!

స్నేహించే దేవుడు

“సృష్టిలో తీయనిది స్నేహమేనోయి. అది లేని జీవితం వ్యర్థమేనోయి” అన్నాడో కవి. మనిషితో మనిషి స్నేహం అంత తీయనిది ఐతే సాక్షాత్తూ దేవుడే మనిషితో స్నేహం చేస్తే అది ఇంకెంత తీయనిది! ఆ జీవితం ఇంకెంత సార్థకమైంది!

క్రీస్తుకు పట్టం కట్టే పరిచర్య

“సెలబ్రిటీ సేవకుల” కాలంలో జీవిస్తున్నాం మనం. వేదికలపైన “దైవ జనులు” సన్మానాలు చేయించుకుని వేడుకలు చేసుకుంటున్న దినాలివి. యూట్యూబ్ లో “లైక్స్” కొట్టించుకుంటూ, వాటికి “ర్యాంకింగ్స్” ఇచ్చుకుంటూ, “బౌన్సర్లను” పెట్టుకుని, కానుకల కాసులతో “దైవ సేవకులు” BMW లలో ఊరేగుతున్న రోజులివి. తాము విమానమెక్కితే వీడియో, “జూ” కెళితే వీడియో, తమ పిల్లలు ఆడినా పాడినా వీడియో. సామాజిక మాధ్యమాల్లో “అంతా మనదే హవా” అన్నదే యావ. పరిచర్య అంటే “మనమూ మన కుటుంబమే” ఇంకెవరూ కనపడకూడదన్న స్వాతిశయ పరాయణత్వం! గొప్పల డప్పులు కొట్టుకుని చిట్టచివర “దేవునికే మహిమ” అంటూ ముక్తాయించే వేషధారణకు ఇపుడు కొదువేమీ లేదు.

సర్వాధికారికి శిరస్సువంచే సేవ

ప్రభువు తన సంఘానికి ఇచ్చిన చిట్టచివరి ఆజ్ఞ, అంతిమ బాధ్యత—సర్వ మానవాళికి సువార్త ప్రకటించడం! సువార్త సర్వ జనావళికి లేక “సమస్త జనులకు” (మత్త.28.19) లేక “సర్వ సృష్టికి” (మార్కు 16.15) ఎందుకు ప్రకటించాలి? అది క్రైస్తవులకే ఎందుకు పరిమితం కాదు?

క్రీస్తు మనస్తత్వం

మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?

అపవాదికి భయపడకండి

మన దేశం మూఢ నమ్మకాలకు పెట్టింది పేరు. తుమ్మితే అనర్థం, నల్ల పిల్లి ఎదురైతే అనర్థం, నర దిష్టి అనర్థం, ఇంట గోళ్ళు కత్తిరిస్తే అనర్థం, నోట “చావు” అంటే అశుభం, మంగళవారం అశుభం, నల్లరంగు అశుభం, అమావాస్య అశుభం, వితంతువు ఎదురొస్తే అశుభం, బుధవారం ఆడపిల్ల పుడితే అరిష్టం, కాకి తల మీద తన్నితే అరిష్టం, బల్లి మీదపడితే అరిష్టం, ఇలా ఒకటేమిటి, అనేకమైన మూఢ నమ్మకాలు మన తెలుగు రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. ఈ మూఢ నమ్మకాల వల్లనే అనేక భయాల్లో మనవాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దుర్ముహూర్త భయం, వాస్తు భయం, దిష్టి భయం, జాతకాల భయం, చేత బడి భయం, క్షుద్ర పూజల భయం. అన్నింటికీ మించి మరణ భయం!