మన చిత్తం vs దేవుని చిత్తం
చాన్నాళ్ల క్రితం ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి సి. ఎస్. లూయిస్ ఒక మాటన్నారు. “నరకంలో పాడుకునే పాట ఒక్కటే—నా చిత్తమే సిద్ధించింది కదా—అని.” నిజమే. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలేరు. నా తండ్రి చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారు—అని మన ప్రభువు ముందే చెప్పారు (మత్త.7.21). విశ్వాసికి అవిశ్వాసికి ఇదే తేడా. అవిశ్వాసి తన ఇష్టానుసారం జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువు చిత్తానుసారం జీవిస్తాడు (ఎఫెసి 6.6). దేవుని చిత్తం జరిగించే వాడే నా వాడు—అన్నారు ప్రభువు (మార్కు 3.35).
ప్రభుత్వాలన్నీ దేవుడివే
ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.