క్రైస్తవ మనస్సాక్షి
మనస్సాక్షి వల్లనే లోకంలో ఇంకా కాస్తయినా మానవత్వం బ్రతికి ఉంది. మనస్సాక్షి వల్లనే ప్రతీ మనిషికీ తప్పొప్పులు తెలుస్తాయి (రోమా 2.14,15). మనస్సాక్షి మనిషికి దేవుడిచ్చిన వరం. నైతికతకు మూలాధారమైన దేవుడు మనిషిని “తన పోలికలో” సృష్టించాడు కాబట్టే సహజంగా మనిషికి నైతిక స్పృహ అబ్బింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే “మనస్సాక్షి”.