1963 మార్చి 04
జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ (1871-1963) అమెరికా దేశమునుండి భారత దేశమునకు వచ్చిన ప్రొటెస్టంట్ మిషనరీ, ఈయన భారతదేశంలో 15 సంవత్సరాలు మిషనరీగా, సువార్తికునిగా సేవ చేశాడు. ఇంకా చాలా ప్రపంచ దేశాలలో మిషనరీగా సేవలందించిన కారణాన ఈయనను, ప్రపంచ మిషనరీగా చెప్పవచ్చును. ఈయన యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (YMCA)తో కలిసి పనిచేశాడు, భారతదేశం అంతటా ప్రయాణించి విద్యార్థులకు బోధించాడు, సామాజిక సేవ, సువార్త భారంగా చేసాడు. ప్రజలను క్రెస్తవ్యము లోనికి నడిపించటానికి ఎన్నడూ ఇతర వర్గాలను కించపరచాలని కోరుకోలేదు. ఈయన పెద్ద సమూహాలకు బోధించేవాడు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు, మేధావులపై దృష్టి సారించాడు.