• మే 25, 1805

    మే 25, 1805

    ఈ రోజు ప్రఖ్యాత క్రైస్తవ అపాలజిస్ట్, తాత్వికుడు విలియం పాలే అమెరికాలోని లింకన్షైర్ లో పరమపదించిన రోజు. ప్రకృతిలో ఉన్న నిర్మాణ క్రమం ఆధారంగా ఇతడు ఆస్తిక సమర్థనా వాదాన్ని రూపొందించాడు. మానవ శరీర నిర్మాణంలోని సంక్లిష్టత, విశ్వంలోని నిర్మాణ సంక్లిష్టత దేవుని ఉనికిని నిరూపించే సిద్ధాంతాలను సూత్రీకరించాడు పాలే. ఈయన సూత్రీకరించిన “గడియారం—నిర్మాణకుడు” ఉదాహరణ విశ్వ విఖ్యాతమయ్యింది.

    Read More

  • మే 24, 1844

    మే 24, 1844

    ఏక తంతి టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టిన శామ్యూల్ ఎఫ్. బి. మోర్స్ మొదటి సారి దాన్ని ప్రదర్శించింది ఈ రోజే. అమెరికా సుప్రీం కోర్టు నుంచి బాల్టిమోర్ కి ఆయన మొట్టమొదటి సారి టెలిగ్రాం సందేశం పంపారు. సంఖ్యాకాండం 23.23 లోని “దేవుని కార్యాలు” (What God has wrought) అనే వాక్యం ఆయన మోర్స్ కోడ్ ద్వారా మొదట పంపిన సందేశం.

    Read More

  • 1738 మే 24

    1738 మే 24

    లండన్‌లోని ఆల్డర్స్‌గేట్ స్ట్రీట్‌లో ఈ రోజు జరిగిన మొరేవియన్ సమావేశం జరిగింది. అందులో రోమా పత్రిక పైన లూథర్ రాసిన వ్యాఖ్యానానికి ముందు మాట చదువుతుండగా విన్న జాన్ వెస్లీ అక్కడే తన “హృదయం మండినట్లు” భావించాడు. ఈ సంఘటన అతన్ని గొప్ప ఆత్మల సంపాదకునిగా మార్చేసింది. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ మారుమనస్సు పొందిన రోజు ఇది.

    Read More